వర్షాకాలం వచ్చేసింది! ఒకపక్క జోరుగా వానలు కురుస్తుంటే, మరొకపక్క నిల్వ నీటిలో దోమలు, ఈగలు చేరి రోగాలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్లో పిల్లలు బడులకు వెళ్లడం, వాతావరణం మారడంతో రోగనిరోధక శక్తి తగ్గి జ్వరం, జలుబు, ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటారు. ఈ వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే మన శరీరంలో ఇమ్యూనిటీ చాలా బలంగా ఉండాలి. దానికి సహాయపడే 3 అద్భుతమైన హెల్తీ జ్యూస్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
1. జామున్ (అల్ల నేరేడు) జ్యూస్: వర్షాకాలంలో దొరికే అల్ల నేరేడు పండ్ల జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇక ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచి వర్షాకాలంలో వచ్చే రకరకాల ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని ఇస్తుంది. జీర్ణక్రియను కూడా ఇది మెరుగుపరుస్తుంది.

2. దానిమ్మ రసం (పోమోగ్రానెట్ జ్యూస్): దానిమ్మ పండ్ల రసంలో వ్యాధులను తరిమికొట్టే అనేక అద్భుతమైన పోషక గుణాలు ఉన్నాయి. ఇక వర్షాకాలంలో క్రమం తప్పకుండా దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ ‘సి’ శరీర ఇమ్యూనిటీ వ్యవస్థను బలపరిచి, నీరసాన్ని తగ్గించి రోజంతా ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
3. ప్లం (అల్పాకారా) జ్యూస్: వర్షాకాలంలో తప్పనిసరిగా తాగాల్సిన మరొక అద్భుతమైన రసం ప్లం జ్యూస్. ఇది జీర్ణ వ్యవస్థను చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది మరియు శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది. ఇక ఇందులో ఉండే పోషకాలు రోగనిరోధక శక్తిని వేగంగా పెంచడంలో ఎంతగానో సహాయపడతాయి.
వర్షాకాలంలో రోగాల బారిన పడకుండా ఉండాలంటే బయటి జ్యూస్లు, చల్లటి పానీయాలకు దూరంగా ఉండి.. ఇంట్లోనే తాజా పండ్లతో చేసుకున్న ఈ జ్యూస్లను తాగడం చాలా మంచిది. ప్రకృతిసిద్ధంగా ఇమ్యూనిటీని పెంచుకుని ఈ వర్షాకాలాన్ని హాయిగా ఆస్వాదించండి.
గమనిక: జ్యూస్లలో పంచదార ఎక్కువగా వేసుకోకుండా సహజమైన రుచితోనే తాగడానికి ప్రయత్నించండి. డయాబెటిస్ లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే పండ్ల రసాలను తీసుకోండి
