సంక్రాంతి తర్వాత ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు

-

తెలంగాణ రాష్ట్రంలో ఇల్లు కట్టుకునే వారికి మంత్రి హరీష్‌రావు తీపికబురు చెప్పారు. సంక్రాంతి తర్వాత ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షలు అందిస్తామని వెల్లడించారు హరీష్‌రావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింగరేణి ప్రైవేటీకరణ పోవాలంటే బిజెపి పోవాలన్నారు. తెలంగాణలో నాలుగు బొగ్గు గనులను సింగరేణికి ఇవ్వకుండా వేలం వేస్తున్నారని.. ఇది అన్యాయం అని మండిపడ్డారు.

పార్లమెంటులో చెప్పిన మాటలు నమ్మాలా.. రామగుండం గల్లీలో మాటలు నమ్మాలా అని ఎద్దేవా చేశారు. సింగరేణి కార్మికుల పరిరక్షణ కోసం బిఆర్ఎస్ కట్టుబడి ఉందన్నారు. సీఎం కేసీఆర్ వల్ల జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు మంత్రి హరీష్ రావు. రామగుండంలో సింగరేణి కార్మికుల పిల్లలకు ప్రత్యేక రిజర్వేషన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి చెప్పారని తెలియజేశారు. కార్మికుల పిల్లలు కార్మికులు కాకూడదని.. డాక్టర్లు కావాలని అన్నారు. సీఎం కేసీఆర్ సింగరేణి, ఆర్టీసీని కాపాడుతూ ఉద్యోగాల కల్పన చేస్తున్నారని తెలిపారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version