ఏపీలో కొత్తగా 349 కరోనా కేసులు, 2 మరణాలు

-

ఏపీ లో కరోనా కేసులు… ఓ సారి పెరుగుతూ.. ఓ సారి తగ్గుతూ… వస్తున్నాయి. అయితే.. ఇవాళ కాస్త.. తగ్గాయి కరోనా కేసులు. నిన్న 481 నమోదైన కరోనా కేసులు… ఇవాళ 300 కు పడిపోయాయి. ఇక తాజాగా ఏపీ ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ ప్రకారం.. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన 24 గంటల లో కొత్తగా 349 కరోనా కేసులు నమోదు అయ్యాయి.

దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ లో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 20,66, 065 కి పెరిగింది. ఒక్క రోజు వ్యవధిలో ఇద్దరు చనిపోవడంతో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14, 369 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4649 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో 535 మంది బాధితులు కరోనా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక ఇప్పటి దాకా కరోనా బారిన పడి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 20, 47, 047 లక్షలకు చేరింది. ఇక నిన్న ఒక్క రోజే ఏపీలో 35, 054 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 2, 94 , 78 , 939 కరోనా పరీక్షలు చేసినట్టు వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version