ఆడుకోనివ్వడం లేదంటూ స్టేషన్ లో తండ్రిపై కొడుకు ఫిర్యాదు ..!

-

ఈ మధ్య కాలంలో పిల్లలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి తమ టీచర్స్ పైనా అలాగే పేరెంట్స్ పైన ఫిర్యాదులు చేయడం మనం చూస్తూనే ఉన్నాము. అయితే ఈ సోషల్ మీడియా కాలంలో సెల్ ఫోన్ లో చూస్తూ విషయాలు నేర్చుకుంటున్న పిల్లలు ఇలాంటి చేసినప్పుడు అందుకు సంబంధించిన వార్తలు, వీడియోలు అదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఇంటి వార్త ఒకటి సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది.

తనను ఆడుకోనివ్వడం లేదంటూ స్టేషన్ లో తండ్రిపై ఓ కొడుకు ఫిర్యాదు చేసాడు. మధ్య ప్రదేశ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. ధార్‌కి చెందిన హుస్సేన్ అనే 5 ఏళ్ళ బాలుడు.. తన తండ్రి తనను ఆడుకోనివ్వడం లేదని.. నాదలోకి వెళ్లి ఈత కొటనివ్వడం లేదని స్టేషన్ కు వచ్చి తన బుజ్జి బుజ్జి మాటలతో ఫిర్యాదు చేసాడు. అయితే ఈ ఫిర్యాదు చేయడానికి తన తండ్రితోనే హుస్సేన్ స్టేషన కు రావడం గమనించాల్సిన విషయం.

Read more RELATED
Recommended to you

Exit mobile version