జమ్మూ కాశ్మీర్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ తరుణంలోనే జమ్మూ కాశ్మీర్ లోని సాంబ సెక్టార్లో ఏడుగురు చొరబాటుదారులు హతం అయ్యారు. భారత్లోకి చొరబడేందుకు జైషేమహ్మద్ యత్నం చేసింది. ఈ తరుణంలోనే ఏడుగురు జైషేమహ్మద్ చొరబాటుదారులను హతమార్చిన BSF.. ఈ మేరకు ప్రకటన చేసింది.

అటు ఉరి సెక్టార్లో పాకిస్తాన్ సైన్యం జరిపిన దాడుల్లో పౌర ప్రాంతాలు కూడా లక్ష్యంగా చేసుకోబడ్డాయి.ఈ దాడుల్లో ఒకరు మహిళ మరణించగా, నలుగురు గాయపడ్డారని భారత ప్రభుత్వం ప్రకటించింది. అయితే, పౌరులపై పాక్ చేసిన దాడులకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.పాక్ సరిహద్దు పాంత్రాల్లో ఉన్న పౌరుల భద్రతపై కూడా భారత ప్రభుత్వం దృష్టి సారించింది. పాక్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో పెద్దఎత్తున పౌరుల ఇల్లు ధ్వంసం అయ్యాయి.