ఏపీలో దారుణం..8 ఏళ్ల బాలికపై 74 సంవత్సరాల వృద్ధుడు లైంగిక దాడి!

-

దేశంలో మహిళలపై అఘాయిత్యాలు రోజు రోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు కొందరు దుర్మార్గులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కటిన చట్టాలు తీసుకువచ్చినా… మహిళలపై దాడులు ఏమాత్రం ఆగడం లేదు. దేశంలోని ఏదో మూలన రేప్ కేసులు బయటపడుతూనే ఉన్నాయి.

అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని ఎనిమిదేళ్ల బాలికపై 74 ఏళ్ల వృద్ధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని.. ఉండి మండలంలో చోటు చేసుకుంది.

ఈ ఘటన జరిగి మూడు రోజులు కాగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక కు రక్తస్రావం రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయం తెలిసిన బాధిత బాలిక కుటుంబ సభ్యులు… నేరుగా వెళ్లి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు… నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ఆ వృద్ధుడు పరారీలో ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version