అదిరే పోస్ట్ ఆఫీస్ స్కీమ్.. రూ.8 లక్షల రిటర్న్స్..!

-

పోస్ట్ ఆఫీస్ ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చాలా లాభాలని పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ పొదుపు పథకాల్లో డబ్బులు పెట్టుకుంటే చక్కటి లాభాలు ఉంటాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ ని పెంచింది. రికరింగ్ డిపాజిట్ కూడా పోస్ట్ ఆఫీస్ లో వుంది. వడ్డీ రేటు 30 బేసిస్ పాయింట్స్ పెరిగింది. గతంలో 6.2 శాతంగా ఉన్న వడ్డీని 6.5 శాతం గా మార్చింది. 2023 జూలై-సెప్టెంబర్ కాలానికి ఈ వడ్డీ రేటు వర్తిస్తుంది.

పదేళ్ల పాటు ప్రతీ నెలా పొదుపు చేసుకోవచ్చు. ఎలాంటి రిస్క్ లేకుండా రిటర్న్స్ పొందొచ్చు. ఇందులో 18 ఏళ్లు దాటినవారు ఎవరైనా సరే చేరొచ్చు. ముగ్గురు కలిసి జాయింట్ అకౌంట్ ని కూడా తెరవచ్చు. మైనర్ల పేరు మీద గార్డియన్లు కూడా ఈ అకౌంట్ ని ఓపెన్ చేయొచ్చు. కనీసం నెలకు రూ.100 నుంచి గరిష్టంగా ఎంత అయినా ఇన్వెస్ట్ చెయ్యచ్చు.

ఐదేళ్ల కాలానికి రికరింగ్ డిపాజిట్ ని తెరవచ్చు. ప్రతీ మూడు నెలలకు ఓసారి వడ్డీ రేట్లను మారుస్తుంది. నెలకు రూ.5,000 చొప్పున 10 ఏళ్లు పొదుపు చేస్తే, ప్రస్తుత వడ్డీ రేటు 6.5 శాతం ప్రకారం రూ.8.46 లక్షల రిటర్న్స్ ని పొందవచ్చు. 10 ఏళ్లలో డిపాజిట్ చేసే మొత్తం రూ.6 లక్షలు అయితే రూ.2.46 లక్షల వడ్డీ వస్తుంది. అకౌంట్ ఓపెన్ చేసిన ఏడాది తర్వాత 50 శాతం లోన్ ని తీసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news