కొడంగల్ లో దారుణం…10 ఏళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి హత్య..గుప్త నిధుల కోసమే !

-

వికారాబాద్ జిల్లా కొడంగల్ పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. ఓ పదేళ్ల బాలుడిని కిడ్నాప్ చేసి హత్య చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. ఎస్సి హాస్టల్ ముందు ముళ్ల పొదల్లో సూట్ కేస్ లో వేసి పడేశారు దుండగులు.

అయితే… రాజా ఖాన్(10) ను కిడ్నాప్, హత్య కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు కొడంగల్ పోలీసులు. అయితే… ఈ కేసులో ఓ కొత్త చర్చ తెరపైకి వచ్చింది. గుప్త నిధుల కోసమే ఆ బాలున్ని బలి ఇచ్చినట్లు చర్చించుకుంటున్నారు స్థానికులు. దీంతో కొడంగల్ లో పరిస్థితి ఉద్రిక్తతంగా మారంది. అటు భారీ పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version