నవీన్‌ కేసు రిలీట్‌…..అమ్మాయి కోసం స్నేహితున్ని హత్య చేసిన అన్నదమ్ములు

-

తెలంగాణలో మరో దారుణం చోటు చేసుకుంది. అచ్చం నవీన్ హత్య లాగే, మరో సంఘటన చోటు చేసుకుంది. ఓ అమ్మాయి కోసం స్నేహితుడుని హత్య చేశారు ఇద్దరు అన్నదమ్ములు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం ఆంధ్రానగర్ వేంకటేశ్వర కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది.

ఈ సంఘటన వివరాల్లోకి వెళితే, రాజు అనే వ్యక్తి ప్రేమించిన అమ్మాయిని కార్తిక్ ప్రేమిస్తున్నాడనే అనుమానంతో కార్తిక్ ను హతమార్చారు రాజు మరియు హరీష్. మద్యం మత్తులో కార్తీక్ ను హత్య చేసిన విషయం మరో స్నేహితుని చెప్పడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.

ఇక మృతుని తల్లికి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. అయితే, నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. 2021 సెప్టెంబర్ నుంచి కనిపించకుండా పోయిన కార్తీక్… గుట్ట రాళ్ల మధ్యలో అస్తిపంజరంను గుర్తించారు పోలీసులు. అస్తి పంజరంకు పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు… కార్తీక్‌ బాడీ అని గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version