మునుగోడు ఉప ఎన్నిక EVMల దొంగతనానికి కుట్ర !

-

మునుగోడు లో నిన్న పోలింగ్ ముగిశాక ఈవీఎంలను తీసుకెళ్తున్న బస్సును కొంతమంది వెంబడించడం కలకలం రేపుతోంది. నల్గొండకు వెళ్తుండగా కారులో కొంతమంది ఫాలో అయ్యారు. బస్సు అంటే కారు వస్తుండటంతో పోలీసులు అప్రమత్తమై ఆ వాహనాన్ని పట్టుకునేందుకు కిందకు దిగారు.

దీంతో అలర్ట్ అయిన ఆ నిందితులు.. ఆ వాహనాన్ని అక్కడే వదిలి అక్కడి నుంచి పారిపోయారు. ఈ నిందితులు ఐదుగురు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం వారి వాహనాన్ని సీజ్ చేశారు పోలీసులు. ఆ నిందితులు ఈవీఎంలను ఎత్తుకెళ్లడానికి వచ్చారని పోలీసులు అలాగే స్థానికులు భావిస్తున్నారు. కాగా  మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్.. 93.13 శాతంగా నమోదైంది.  మొత్తం ఓట్లు 2,41,805, పోలైన ఓట్లు 2,25,192.. పోలైన పోస్టల్ ఓట్లు 686 పడినట్లు అధికారులూ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version