హైకోర్ట్ కి చేరిన ఆనందయ్య పంచాయితీ… హైకోర్ట్ తీర్పు ఏంటీ…?

-

నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలోని ఆనందయ్య ఆయుర్వేదిక్ మందులపై ఏపీ హైకోర్ట్ లో హౌస్ పిటిషన్ దాఖలు అయింది. హౌస్ మోషన్ పిటిషన్ అనుమతి కోసమై హైకోర్ట్ న్యాయవాది యలమంజుల బాలాజీ దరఖాస్తు చేసారు. అనంతపురం జిల్లాకు చెందిన మాదినేని ఉమామహేశ్వరనాయుడు తరపున హౌస్ మోషన్ పిటిషన్ వేసారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో కరోనా నివారణ కోసం ఆనందయ్య ఆయుర్వేద మందు ఇస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు.

ఈ మందు తీసుకుని అనేకమంది కోలుకున్నారు అని అన్నారు. ఆకస్మాత్తుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ మందు పంపిణీని నిలిపివేసింది అని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల అనేకమంది ఈ మందును తీసుకోలేకపోతున్నారు అని దీనిపై విచారణ జరిపేందుకు అనుమతించాలని హైకోర్ట్ కు న్యాయవాది లేఖ రాసారు. హౌస్ మోషన్ పిటిషన్ పై ఇంకా హైకోర్ట్ అనుమతి రాలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version