అమెరికాతో కీలక ఒప్పందం.. ఇండియాకు రానున్న ప్రెడెటర్ డోన్స్!

-

భారత్, అమెరికా మధ్య కీలక ఒప్పందం కుదిరింది. మన సాయుధ బలగాల నిఘా సామర్థ్యాలను మరింత బలోపేతం చేసేందుకు అమెరికా నుంచి భారత్ 31 ప్రిడేటర్ డ్రోన్ల కొనుగోలుకు భారత్ అంగీకారం తెలిపింది. వాటి నిర్వహణ, మరమ్మత్తు, సమగ్ర ఏర్పాటు కోసం రూ.32 వేల కోట్ల ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకం చేయనున్నాయి. ఈ ఒప్పందం మంగళవారం జరగనున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. అందుకోసమ అమెరికన్ బృందం భారత్‌కు వచ్చినట్లు పేర్కొన్నారు.

ఇకపోతే, భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ 31 ప్రెడెటర్ డ్రోన్‌లను కొనుగోలు చేయడానికి గతవారం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. వాటిలో 15 భారత నావికాదళానికి వెళ్తాయి. మిగిలినవి వైమానిక దళం, ఆర్మీల మధ్య సమంగా విభజించనున్నారు. అమెరికాతో ఒప్పందంపై భారత్ చాలా ఏళ్లుగా చర్చలు జరుపుతోంది. కాగా, కొన్ని అనివార్య కారణాల వల్ల ఒప్పందం ముందుకు సాగలేకపోయింది. ఇటీవల జరిగిన భేటీలో డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ భేటీలో చివరి అడ్డంకులు తొలగిపోవడంతో ఈ డీల్ త్వరలోనే ఫినిష్ కానుందని రక్షణ శాఖ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version