అత్తాపూర్‌లో దంపతులపైకి దూసుకెళ్లిన లారీ.. భర్త మృతి

-

హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లో లారీ బీభత్సం సృష్టించింది. హైదర్‌గూడ చౌరస్తా వద్ద బస్సుకోసం వేచి చూస్తున్న దంపతులపైకి ఒక్కసారిగా దూసుకెళ్లింది. అతివేగంగా దూసుకొచ్చిన కంటైనర్‌ లారీ భార్యా భర్తలను ఢీకొట్టింది.

వాహనం చక్రాల కింద పడి భర్త రత్తయ్య మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన భార్య మంజులను స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సును ఓవర్ టేక్ చేసే సమయంలో.. లారీని మితిమీరిన వేగంతో నడపడమే ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version