వైరల్ : పానిపురిలో ఉల్లిగడ్డ వేయలేదని యువతి హల్ చల్.. వ్యాపారిపై దాడి

-

పానీ పూరి.. అంటే ఇష్టపడని వారు ఉండరు. చాలామంది ఎంతో ఇష్టంగా పానీపూరి ని రెగ్యులర్ గా తింటారు. పురుషుల కంటే మహిళలే ఈ పానీ పూరి కోసం ఎక్కువగా ఎగబడతారు. వీకెండ్ వచ్చిందంటే చాలు… పానీ పూరి బండ్లకు ఫుల్ గిరాకీ ఉంటుంది. ఇక పానీపూరి లో ఉల్లిగడ్డ.. లేనిదే ఎవరూ తినరు. ఉల్లిగడ్డ ఎక్కువ కావాలని ప్రతి కస్టమర్ పానీపూరి యజమానిని అడుగుతాడు.

అయితే తాజాగా ఉల్లిగడ్డ కోసం యువతి పానీపూరి బండి యజమానిపై దాడి చేసింది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళితే.. టీ షర్ట్, ఆఫ్ పాయింట్ వేసుకొని ఓ యువతి… పానీపూరి బండి దగ్గరికి వచ్చింది. ఎంతో ఇష్టంగా అతని దగ్గర పానీ పూరి తిన్నది ఆ యువతి. అయితే మధ్యలో తనకు ఉల్లిగడ్డ కావాలని ఆ యజమానిని అడిగింది.

ఉల్లిగడ్డ… తన దగ్గర ప్రస్తుతం అయిపోయిందని.. ఇప్పటికీ తినేయండి అని ఆ యజమాని చెప్పాడు. దీంతో ఆగ్రహానికి లోనైన ఆ యువతి… అతడితో వాగ్వివాదానికి దిగింది. తిన్న వరకు డబ్బులు ఇవ్వని యజమాని అడిగితే… అతని పానీపూరి బండి, అలాగే అతనిపై దాడి చేసింది ఆ యువతి. అక్కడే ఉన్న ఓ యువకుడు ఈ తతంగాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ యువతి పై మండిపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news