ఎ బి డివిలియర్స్ పప్పులో కాలేశాడే ? ఇండియా గెలిచి నిలిచింది చూడు సామీ!

-

నిన్న ఎంతో ఉత్కంఠ భరితంగా ఆసక్తికరంగా సాగిన వరల్డ్ కప్ మొదటి సెమి ఫైనల్ మ్యాచ్ లో ఇండియా 70 పరుగుల తేడాతో గెలిచి గ్రాండ్ గా ఫైనల్ లోకి ఎంటర్ అయింది. ఇండియా నిర్దేశించిన 398 పరుగుల లక్ష్యాన్ని చేధించే క్రమంలో మరో 7 బంతులు మిగిలి ఉండగానే కివీస్ ఆల్ అవుట్ అయ్యి ఘోర ఓటమిని చవిచూసి వరల్డ్ కప్ నుండి మరోసారి సెమీఫైనల్ లోనే నిష్క్రమించింది. ఈ ఫలితంతో సౌత్ ఆఫ్రికా మాజీ ప్లేయర్ ఎ బి డివిలియర్స్ గత వారంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. వరల్డ్ కప్ ఫైనల్ కు ఇండియా చేరదు, న్యూజిలాండ్ తో జరిగే సెమీస్ లో ఓడిపోతుందని జోస్యం చెప్పిన సంగతి తెలిసిందే. కానీ డివిలియర్స్ ఆశలు ఫలించలేదు… వరుసగా పదవ మ్యాచ్ లో ప్రత్యర్థిని చిత్తు చేసి గర్వంగా ఫైనల్ కు చేరుకుంది.

ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా డివిలియర్స్ మీద కామెంట్స్ లు చేస్తున్నారు నెటిజన్లు. ఎ బి డి పప్పులో కాలేశాడే… చుడబ్బా ఇండియా గెలిచి ఫైనల్ కు వెళ్ళింది అంటూ కామెంట్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news