అబ్దుల్ కలాం జయంతి.. సీఎం రేవంత్ ఘన నివాళి!

-

భారతరత్న అవార్డు గ్రహీత, మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఘననివాళి అర్పించారు. జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో మంగళవారం కలాం చిత్రపటానికి పూలమాల వేసి నమస్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, సీఎం సలహాదారు మేం నరేందర్ రెడ్డి సైతం పాల్గొని కలాం చిత్రాపటానికి నమస్కరించి నివాళులు అర్పించారు.

అంతకుముందు ట్విట్టర్ (ఎక్స్) వేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పందిస్తూ.. ప్రతిభకు పేదరికం అడ్డుకాదని కలాం నిరూపించారని, అంతేకాకుండా దేశ రక్షణ దిశను మార్చి, క్షిపణి పితామహుడయ్యాడని కొనియాడారు. అంతరిక్ష పరిశోధనల్లోనూ ఇండియా కలలకు రెక్కలు తొడిగారని, ప్రజల రాష్ట్రపతిగా, యువతకు స్పూర్తి మంత్రంగా నిలిచిన అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా వినమ్ర నివాళి అని రాసుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version