పరవాడ ఫార్మాసిటీలో విష వాయువులు లీక్.. ఇద్దరు ఉద్యోగులు మృతి

-

Accident at Paravada Pharmacity in Anakapalle district: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలో.. ఘోర ప్రమాదం జరిగింది. పరవాడలోని ఎస్ ఎస్ ఫార్మాసిటికల్ లో విష వాయువులు.. లీక్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. మరో ఉద్యోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

parawada
Accident at Paravada Pharmacity in Anakapalle district

అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అటు మరణించిన ఉద్యోగుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విషవాయులు ఎలా లీక్ అయ్యాయి అనే దాని పైన విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news