Accident at Paravada Pharmacity in Anakapalle district: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మసిటీలో.. ఘోర ప్రమాదం జరిగింది. పరవాడలోని ఎస్ ఎస్ ఫార్మాసిటికల్ లో విష వాయువులు.. లీక్ అయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఇద్దరు ఉద్యోగులు మృతి చెందారు. మరో ఉద్యోగి పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు చెబుతున్నారు.

అతన్ని వెంటనే స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అటు మరణించిన ఉద్యోగుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం.. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విషవాయులు ఎలా లీక్ అయ్యాయి అనే దాని పైన విచారణ చేస్తున్నారు. ఈ సంఘటనపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.