హైద‌రాబాద్‌ లో మరో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు ఏపీ యువ‌కులు మృతి

-

హైద‌రాబాద్ లో మ‌రో ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. దుండిగల్ పీఎస్ పరిధి బౌరంపేటలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది కారు. దీంతో ముగ్గురు యువ‌కులు దుర్మరణం చెందారు. బౌరంపేట కోకాకోలా కంపెనీ వద్ద అర్ధరాత్రి తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో వేగంగా కారు నడుపుతూ లారీని ఢీకొట్టారు యువకులు.

ప్రమాదానికి అతివేగమే కారణమని భావిస్తున్నారు పోలీసులు. కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన అశోక్‌ను సూరారం మల్లారెడ్డి ఆస్పత్రికి తరలించారు పోలీసులు. మృతులు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, విజయవాడ వాసులుగా గుర్తించారు పోలీసులు. మృతులు చరణ్(విజయవాడ), సంజూ, గణేశ్‌(ఏలూరు)గా గుర్తించారు. ప్రమాద సమయంలో చరణ్ డ్రైవింగ్ చేస్తున్నట్లు పోలీసుల వెల్లడించారు. ఈ ప్ర‌మాదంలో గాయపడిన అశోక్(ఏలూరు) పరిస్థితి విషమంగా ఉందన్నారు పోలీసులు. ఇక ఈ రోడ్డు ప్ర‌మాదం పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు.. ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version