కర్ణాటకలో మరో దారుణం.. ఒప్పుకోలేదని యాసిడ్ దాడి..

-

దేశంలో రోజురోజుకు ఉన్మాదులు పేట్రేగిపోతున్నారు. తమ ప్రేమను అంగీకరించలేదని ప్రేమించిన అమ్మాయిలపైనే దాడులకు పాల్పడుతూ.. జైలు పాలవుతున్నారు. ఎన్ని చట్టాలు చేసినా.. ఎంత కఠిన శిక్షలు వేసినా.. మృగాళ్లు మాత్రం మారడం లేదు.. కర్ణాటక రాజధాని బెంగళూరులో మరో దారుణం చోటు చేసుకుంది. బెంగళూరు నగరంలోని ఓ గోల్డ్‌ ఫైనాన్స్‌ కంపెనీలో పనిచేస్తున్న 24 ఏళ్ల మహిళని నగేష్ అనే 27 ఏళ్ళ యువకుడు గత కొంతకాలంగా ప్రేమిస్తున్నానని వేధించేవాడు. వీరిద్దరూ గతంలో ఒక గార్మెంట్ ఫ్యాక్టరీలో కలిసి పనిచేసేవారు.. దీంతో వీరిద్దరికి రెండేళ్ల నుంచే పరిచయం ఉంది. ఈ నేపథ్యంలో చాలా నెలల నుంచి తనను ప్రేమించాలంటూ నగేష్ యువతి వెంట పడేవాడు.

ఆమెకు తరచూ ఫోన్ కాల్స్ చేసి వేధించేవాడు. అయితే తనకు ప్రేమ వ్యవహారాలు ఇష్టం లేదని తన తల్లిదండ్రులు ఎవరిని చూస్తే వారినే పెళ్లి చేసుకుంటాని ఆ యువతి పలుమార్లు నగేష్ కి ఖరాఖండిగా చెప్పింది. ఈ క్రమంలో గత బుధవారం సాయంత్రం తనను ప్రేమించాలంటూ నగేష్‌..ఆ మహిళతో తీవ్ర వాగ్వాదానికి దిగాడు. దీంతో తనని ఇంకెప్పుడూ ప్రేమించాలని వేధించనని,ఇక తన లైఫ్ లోకి రాను అంటూ అక్కడి నుంచి నగేష్ వెళ్లిపోయాడు. అయితే మరుసటి రోజు ఉదయం 9 గంటల సమయంలో యువతి ఆఫీస్ ముందు ప్రత్యక్షమైన నగేష్ ఆఫీస్ మెట్ల మీద..తన వెంట తెచ్చుకున్న యాసిడ్ ని ఆమె మెఖంపై పోశాడు. దీంతో వెంటనే అక్కడున్నవారు యువతిని దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నగేష్ ని అరెస్ట్ చేశారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version