టాలీవుడ్‌ లో మరో విషాదం.. నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ మృతి

-

టాలీవుడ్‌ ను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే టాలీవుడ్‌ పరిశ్రమలో చాలా మంది ప్రముఖులు మృతి చెందారు. 2020 నుంచి చిత్ర పరిశ్రమను ఇలా వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. అయితే.. తాజాగా పరిశ్రమలో మరో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ మృతి చెందాడు.

పి.గన్నవరం మండలం రాజుల పాలెం గ్రామానికి చెందిన సినీ నటుడు బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ (64) అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన పలు సినిమా ల్లో నటించారు. కిరాతకుడు సినిమాలో హీరోగా నటించి స్వయంగా నిర్మించారు. రూపాయి సినిమాకు ఆయన సహ నిర్మాతగా వ్యవహరించారు. రాజధాని, సౌర్య చక్ర, దొంగల బండి, బంగారు బుల్లోడు, రంగవల్లి తదితర సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు. ఈయన గతంలో రాజుల పాలెం గ్రామ సర్పంచ్ గా పని చేశారు. ఇక బొమ్మిరెడ్డి రాఘవ ప్రసాద్ మృతి పట్ల పలువురు సినీ నటులు తమ సంతాపం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version