అడివి శేష్ ‘మేజర్’ ఫస్ట్ లుక్..అదరగొట్టాడుగా !

-

టాలెంటెడ్ హీరో అడివి శేష్ హీరోగా సర్ కి తాజా మూవీ మేజర్. సుమారు 12 ఏళ్ల క్రితం ముంబై మీద అ ఉగ్రవాదులు విరుచుకు పడిన సంగతి తెలిసిందే. ముంబైలోని తాజ్ హోటల్ అలాగే చత్రపతి టెర్మినస్ అలాగే మరి కొన్ని ప్రదేశాల్లో ఉగ్రవాదుల మారణహోమం సృష్టించారు. ఈ నేపథ్యంలో ఉగ్ర మొక్క నుండి సామాన్య ప్రజలను రక్షించే ప్రయత్నంలో సందీప్ ఉన్నికృష్ణన్ అని ఒక అధికారి అసువులు బాశారు. ఆయన జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది.

ఈరోజు విజయ్ దివాస్ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ని ఈ సినిమా యూనిట్ విడుదల చేసింది ఈ సినిమా హిందీ అలాగే తెలుగు రెండు భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతోంది ఇక ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానున్న ఈ సినిమా హీరో తన ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. అయితే ఈ సినిమాని సూపర్ స్టార్ మహేష్ బాబు నిర్మిస్తూ ఉండడంతో ఈ సినిమా మీద మరింత ఆసక్తి నెలకొంది గూడచారి దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని సోనీ పిక్చర్స్ తో కలిసి మహేష్ బాబు నిర్మిస్తున్నారు. 

Read more RELATED
Recommended to you

Latest news