ఆదోని పరువు హత్య.. ఇద్దరి అరెస్ట్

-

ఆదోనిలో సంచలనం రేపిన  ఆడమ్ స్మిత్ (బుడ్డన్న)  పరువు హత్య కేసులో నిందితులు ఇద్దరు అరెస్ట్ అయ్యారు. నిందితులిద్దరు మహేశ్వరి నాన్న చిన్న ఈరన్న , పెదనాన్న పెద్ద ఈరన్నలను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులపై IPC సెక్షన్ 302  మరియు SC ST అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. నిందితులు హత్యకు ఉపయోగించిన ఆయుధం , మోటార్ సైకిల్ తో పాటు నిందితులను మీడియా ఎదుట హాజరుపరిచారు పోలీసులు. అనంతరం వారిని రిమాండ్ కు తరలించారు. మరో పక్క ఆడమ్ స్మిత్ అంత్యక్రియలు స్వగ్రామమైన గురజాలలో ప్రశాంతంగా ముగిసాయి.

ఆదోనిలో పోస్ట్ మార్టం పూర్తిచేసుకుని మద్యాహ్నం 4 గంలకు  ఆడమ్ స్మిత్ మృతదేహం గురజాలకు చేరుకుంది. మృతదేహాన్ని చూసిన కుటుంబసభ్యులు, బంధువులు భోరున విలపించారు.ఆడమ్ స్మిత్ భార్య మహేశ్వరి దిక్కుతోచని స్థితిలో భర్త శవం ముందు రోదన అందరిని కంటతడి పెట్టించింది.ఇంటి దగ్గర భారీ సంఖ్యలో జనం గుమికూడడంతో   కాసేపు ఇంటి దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేయడంతో అంత్యక్రియలు ప్రశాంతంగా ముగిశాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version