లాక్ డౌన్ ఎత్తేయగానే ఈ ఇద్దరి మధ్య వార్ బిగిన్స్ ..!

-

ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా హీరోల మధ్య పోటీ ఉండటం సహజం అన్న సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియోట్ చేయడానికి స్టార్ హీరోలు పడే తాపత్రయం మామూలుగా ఉండదు. దీన్ని బట్టే ఎవరి సత్తా ఏమిటి అన్నది తెలుస్తుంది. అదీ కుడా నంబర్ వన్ స్ఠానం కోసం అన్న క్రేజ్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే ఇక్కడ ఏ హీరో కూడా శాశ్వతంగా ఒకే ప్లేస్ లో ఉండలేడు. టైం బాగాలేదంటే ఆ హీరోకి వరసగా ఫ్లాప్స్ వచ్చి పడతాయి. ఈ సమయంలో మరో హీరో గనక వరసగా సక్సస్ లు అందుకుంటే మార్కెట్ పరంగా, క్రేజ్ పరంగా నంబర్ వన్ స్థాన్ దక్కించుకుంటాడు. ఈ పోటీ కొన్ని సార్లు హీరోలకే ఫ్యాన్స్ కి కూడా నరాలు తెగేంత ఉత్కఠంగా మారుతుంది. ఇప్పుడు కూడా ఇద్దరు కోలీవుడ్ స్టార్ హీరోలు ఈ యుద్దానికి సిద్దంగా ఉన్నారు.

 

“తలపతి” విజయ్ కోలీవుడ్ లో ఇప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ క్రేజ్ ఉన్న హీరో. రెమ్యూనరేషన్ పరంగా రజనీకాంత్ కి పోటా పోటీగా ఉన్నారు. గత నాలుగేళ్ళుగా వరుసగా బ్లాక్ బస్టర్స్ ని అందుకుంటూ ఇప్పుడు నంబర్ వన్ స్థానంలో ఉన్నాడు విజయ్. విజయ్ సినిమాలకి బిజినేస్ కూడా విపరీతంగా జరుగుతోంది. అంతేకాదు టాలీవుడ్ లోను విజయ్ కి ప్రేక్షకులు మంచి క్రేజ్ ఫాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సినిమాలు ఇక్కడ కూడా బాగా వసూళ్ళు రాబడుతున్నాయి.

అలాగే సూర్య కి కోలీవుడ్ తో పాటు టాలీవుడ్ లోను మంచి ఫాన్ ఫాలోయిన్ అండ్ క్రేజ్ ఉన్నాయి. కాని గత కొంతకాలంగా వరసగా సూర్య సినిమాలు ఫ్లాపవడం మూలాన రేస్ లో కాస్త వెనకబడ్డాడు. వాస్తవంగా చెప్పాలంటే ఇంతకముందు కోలీవుడ్ లో హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ అందుకున్న హీరోగా సూర్య కి రికార్డ్ ఉంది. ఇప్పడది రజనీకాంత్, విజయ్ ఖాతాలో పడింది. ఇక ప్రస్తుతం విజయ్ మాస్టర్ సినిమాతో సిద్దంగా ఉన్నాడు. అలాగే సూర్య కూడా సుధ కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన సూరారై పోట్రు సినిమాతో సిద్దంగా ఉన్నాడు. లాక్ డౌన్ ఎత్తి వేయగానే బాక్సాఫీస్ వద్ద పోటీకి రెడీగా ఉన్నారు. ఇప్పటికే విజయ్ మాస్టర్ సినిమాకి 200 కోట్ల బిజినెస్ అయింది. కాని కరోనాతో ఈ పోటీ ఉంటుందా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news