ఫ్యాన్స్ డిమాండ్..ప్యారిస్ లో అఖండ స్పెష‌ల్ షో..!

-

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌య్య హీరోగా న‌టించిన అఖండ సినిమా డిసెంబ‌ర్ 2న విడుద‌లై ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఈ సినిమా మాస్ హిట్ గా బాక్సాఫీస్ వ‌ద్ద దూసుకుపోతుంది. ఇప్ప‌టికే అఖండ సినిమా విడుద‌లైన నాటి నుండి ఆస్ట్రేలియా, అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ ర‌చ్చ‌రచ్చ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా పారిస్ లోనూ బాల‌య్య సినిమా స్పెష‌న్ షో వేయాల‌ని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పారిస్ లో అఖండ సినిమా స్పెష‌ల్ షో వేసేందుకు టీమ్ సిద్ద‌మ‌వుతోంది.

పారిస్ లోని ఫాతేలా విల్లెట్ థియేట‌ర్ లో అఖండ సినిమా వేయాల‌ని నిర్మాత‌లు నిర్న‌యం తీసుకున్నారు. అక్క‌డి టైమ్ ప్ర‌కారం ఈ రోజు రాత్రి 7 45 నిమిషాల‌కు ఈ షోను వేస్తున్నారు. ఇప్ప‌టికే జోరుగా బుకింగ్ లు కూడా జ‌రుగుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా ఉండ‌గా బాల‌య్య హీరోగా న‌టించిన అఖండ సినిమాకు బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఈ సినిమాతో వీరి కాంబోలో హాట్రిక్ కొట్టారు. ఇక ఈ సినిమాలో ప్ర‌గ్యా జైశ్వాల్ హీరోయిన్ గా న‌టించగా శ్రీకాంత్ విల‌న్ గా న‌టించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version