అలయ్ బలయ్‌.. సీఎం రేవంత్ దంపతులకు ఆహ్వానం!

-

జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి రేవంత్ రెడ్డి దంపతులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా అలయ్ బలయ్ కార్యక్రమానికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ నెల 13న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో నిర్వహించబోయే అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కావాలని సీఎం దంపతులను కోరారు.

అలయ్ బలయ్ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వాన పత్రికను సీఎంకు అందజేశారు.కాగా, దసరా సందర్భంగా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా.. సమాజంలో ఆత్మీయత, అనుబంధాలకు ప్రతీకగా బండారు దత్తాత్రేయ, ఆయన కుటుంబసభ్యులు ప్రతి ఏటా అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇందులో కులమతాలు,పార్టీలకతీతంగా పలువురు ప్రముఖులు, అధికారులను ఆహ్వానించి, అందరినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చి వేడుకలను నిర్వహిస్తుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version