Rc-15 పై వస్తున్న వార్తలన్నీ ఫేక్..క్లారిటీ ఇచ్చిన చిత్ర బృందం..!!

-

RRR సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పేరు సంపాదించారు రామ్ చరణ్. ఇక ఈ సినిమా తర్వాత డైరెక్టుగా హీరోగా నటిస్తున్న చిత్రం RC -15 ఈ సినిమా పైన రామ్ చరణ్ అభిమానులు భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే రామ్ చరణ్ తన తండ్రి చిరంజీవి కలిసి నటించిన ఆచార్య సినిమా భారీ డిజాస్టర్ కావడంతో అభిమానులు సైతం నిరుత్సాహ చెందారు. దీంతో ఇప్పుడు RC -15 సినిమా పైన ఆశలని పెట్టుకున్నారు రామ్ చరణ్. అయితే ఈ సినిమా పైన వస్తున్న వార్తలపై చిత్ర బంధం తాజాగా క్లారిటీ ఇవ్వడం జరిగింది వాటి గురించి చూద్దాం.

RC-15 నిర్మాతగా దిల్ రాజు వ్యవహరిస్తూ ఉండడంతో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ తో క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నది.. ఇక రామ్ చరణ్ ఇందులో మూడు పాత్రలు కనిపించబోతున్నారని ఇది వలె లీకైన ఫోటోలతో తెలిసిపోతుంది.. ఇక రామ్ చరణ్ కు జోడిగా కియారా అద్వానీ నటిస్తూ ఉన్నది. అయితే ఇందులోని కొంతమంది ముఖ్య ఆర్టిస్టులు నటిస్తున్నారని వచ్చే ఏడాది సమ్మర్లో ఈ సినిమా పాన్ ఇండియాగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం తెలియజేసింది.

అయితే ఈ సినిమా కోసం నటీనటుల్ని తీసుకుంటున్నారు అని.. అంతేకాకుండా ఇందులో ఫలానా వాళ్లు నటిస్తున్నారని.. టైటిల్ కూడా ఇదే అన్నట్లుగా వార్తలు వెలుపడ్డాయి.. దీనిపై దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై కాస్త క్లారిటీ ఇవ్వడం జరిగింది. RC -15 సినిమా పైన వస్తున్న వార్తలన్నీ అవాస్తవమని మా ప్రాజెక్టులో ఏదైనా పాత్ర కోసం నటించేందుకు ఎవరిని తీసుకోవట్లేదని.. ఒకవేళ మా పేరు చెప్పి అలా ఎవరైనా చేస్తే ఏజెన్సీకి సంబంధం లేదని తెలియజేస్తూ ఒక సమాచారాన్ని అందించారు. దీంతో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ఒక లేఖని విడుదల చేయడం జరిగింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version