‘పోటీ చేస్తున్న వారందరూ లోకల్ గా కేసీఆర్ లే’

-

తెలంగాణ ఎవ్వరి వల్ల బాగు పడిందో చూసి ఓటు వేయాలని సీఎం కేసీఆర్ సూచించారు. ప్రభుత్వం మారితే తెలంగాణ కుక్కలు, నక్కలు చింపిన విస్తరి అవుతుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఇన్నాళ్లూ నేను మీకోసం, మీ అభ్యున్నతి కోసం పోరాడాను. ఇకపై పోరాాల్సింది ప్రజలే. ఎన్నికల సమయంలో ఆగం కావద్దు. వాళ్లు వీళ్లూ చెప్పారని ఓటు వేయకూడదు. తెలంగాణ ఎవ్వరి వల్ల బాగు పడిందో చూసి ఓటు వేయాలి. ఇంటింటికి నల్లా నీరు ఇస్తున్న ఏకైక రాస్ట్రం తెలంగాణనే. దేశానికి దిక్సూచిలా తెలంగాణ ఎదిగింది అని తెలిపారు.

తెలంగాణ కోసం 24 ఏళ్ల క్రితం ఒంటరిగానే ప్రయాణం ప్రారంభించానని సీఎం కేసీఆర్ వనపర్తి ఆశీర్వాద సభలో మాట్లాడారు. 119 నియోజకవర్గాల్లో కేసీఆర్ ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. దమ్ముంటే నా మీద పోటీ చేయ్ అంటున్నారు. 119 చోట్ల కేసీఆర్ ఒక్కడే ఎలా పోటీ చేస్తాడు. పోటీ చేస్తున్న వాళ్లందరూ లోకల్ గా కేసీఆర్ లే. వలసల వనపర్తిని నేడు వరి పంట్ల వనపర్తిగా చేశామన్నారు. గడిచిన పదేళ్లలో ఏం చేశామన్నది మన కళ్ల ముందే కనిపిస్తోందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version