కాశ్మీర్ లో ఎన్ కౌంటర్… ముగ్గురు టెర్రరిస్ట్ లు హతం

-

జమ్మూ కాశ్మీర్‌ లో మరో మారు ఎన్ కౌంటర్ జరిగింది. జమ్మూలోని బుద్గాం జిల్లాలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌ కౌంటర్‌ జరిగిందని జమ్మూ కాశ్మీర్‌ పోలీసులు ఈ ఉదయం ప్రకటించారు. ఇక ఈ ఎన్‌ కౌంటర్‌ లో జమ్మూ కాశ్మీర్‌ పోలీస్‌ విభాగానికి చెందిన ఎస్పీఓ మహ్మద్‌ అల్తాఫ్ అనే ఆయన మృతి చెందగా.. మరో పోలీస్‌ అధికారి అహ్మద్‌ గాయపడ్డారని కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు.

అలానే ఈ ఎన్ కౌంటర్ లో ముగ్గురు గుర్తు తెలియని లష్కర్ ఎ తోయిబా ఉగ్రవాదులను భద్రతా దళాలు మట్టుబెట్టాయి. వారు బుద్గాం ప్రాంతంలో ఉన్నారన్న సమాచారం మేరకు స్థానిక పోలీసులు, భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ ప్రారంభించాయి. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు ఫైర్ ఓపెన్ చేశారు. దీంతో ఇరువర్గాలకు కాల్పులు జరిగాయి. ఈ సందర్భంగా మందు గుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. సెర్చ్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగిస్తున్నట్లు చెబుతున్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news