అల్లరి నరేష్ సినిమా.. అజయ్ దేవగణ్ రీమేక్.. దిల్ రాజు నిర్మాత.

-

తెలుగులో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ కి వెళ్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం చాలా సినిమాలు రీమేక్ దశలో ఉన్నాయి. తాజాగా ఈ లిస్టులోకి అల్లరి నరేష్ నటించిన “నాంది” కూడా చేరింది. టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు, ఈ రీమేక్ లో భాగస్వామ్యం పంచుకుంటున్నాడు. అది కూడా బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ తో కలిసి. నాంది సినిమా రీమేక్ గురించి మాట్లాడిన అజయ్ దేవగణ్, కోర్టుడ్రామాగా రూపొందిన నాంది ప్రేక్షకులను ఉత్కంఠకి గురి చేసింది.

అందుకే ఈ సినిమాని హిందీ ప్రేక్షకులకి పరిచయం చేయాలనుకుంటున్నామని, ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ పూర్తయ్యిందని, ఎవరు నటిస్తున్నారనేది ఇప్పుడు నిర్ణయించలేదని, త్వరలోనే అన్నీ ప్రకటిస్తామని అన్నారు. దిల్ రాజు మాట్లాడుతూ, నాంది చాలా మంచి సినిమా. ఇలాంటి సినిమా పెద్ద మార్కెట్లోకి తీసుకెళ్ళడం, దానికి అజయ్ దేవగణ్ చేయి అందించడం బాగుందని మాట్లాడారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version