అల్లు అరవింద్ డామినేట్ ఉదయ్ కిరణ్ పై అలా ఉండేది అంటున్న నటుడు..!!

-

తెలుగు ఇండస్ట్రీలో హీరో ఉదయ్ కిరణ్ లవర్ బాయ్ గా పేరు పొందారు. అంతేకాకుండా తన మొదటి చిత్రం నుండి వరుసగా చిత్రాలు బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఒక్కసారిగా స్టార్ హీరో రేంజ్ ను సంపాదించుకున్నాడు ఉదయ్ కిరణ్. అయితే అలా ఎదుగుతున్న సమయంలో సడన్గా తన కెరియర్ ఒడిదుడుకులలోకి పడిపోయింది. దాంతో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు పలు కారణాలున్నాయని.. ఒక్కో విధంగా ఒక్కొక్కరు చెబుతూ ఉంటారు. కానీ అసలు విషయం ఏమిటంటే మాత్రం ఉదయ్ కిరణ్ కి మాత్రమే తెలుసు.

ఇక ఉదయ్ కిరణ్ తో పని చేసిన నటీనటులు, దర్శకులు సైతం తమకు తోచిన విధంగా వారు మీడియా ముందు తెలుపుతూ ఉంటారు. ప్రస్తుతం అలనాటి హీరో మురళీమోహన్ కూడా తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉదయ్ కిరణ్ గురించి పలు విషయాలను తెలియచేయడం జరిగింది. మహేష్ బాబుతో తెరకెక్కించిన అతడు చిత్రం అందరికీ తెలిసిందే. ఈ సినిమా అప్పట్లో రికార్డులను సైతం సృష్టించింది అని మురళీమోహన్ తెలిపారు. ఈ సినిమా మొదట హీరో ఉదయ్ కిరణ్ వద్దకు వెళ్లిందని తెలియజేశారు. ఇక ఈ చిత్రం స్టోరీని మొత్తం ఉదయ్ కిరణ్ కు చెప్పగా తను చేయడానికి సిద్ధమని తెలియజేశారట.

అయితే ఈ సినిమా స్టోరీ రాయడానికి కాస్త సమయం అడగగా అందుకు ఉదయ్ కిరణ్ కూడా ఓకే చెప్పాడట కానీ అంతలోనే ఉదయ్ కిరణ్ కి చిరంజీవి కుమార్తె సుస్మిత తో వివాహం చేయడానికి సిద్ధమయ్యారు. అలా వివాహం కుదురుతానే.. ఉదయ్ కిరణ్ కి సంబంధించిన అన్ని విషయాలను కూడా నిర్మాత అల్లు అరవింద్ తన దగ్గరుండి చూసుకునేవాడని మురళీమోహన్ తెలిపారు. ఇక అందుకు సంబంధించిన వాటిని తన డైరీలో రాసి పెట్టుకుంటూ ఉంటాడని అల్లు అర్జున్ తెలియజేశారు మురళి మోహన్.

ఇక అలాంటి సమయంలో అతడు సినిమా అని ఒప్పుకున్నాడు కాబట్టి ఉదయ్ కిరణ్ మురళీమోహన్ వెళ్లి మళ్లీ అడగగా.. అందుకు అల్లు అరవింద్ ఉదయ్ కిరణ్ డేట్స్ ఖాళీగా లేవని చెప్పడం జరిగిందట. దీంతో ఉదయ్ కిరణ్ కూడా ఏమీ చేయలేకపోయారని తెలిపారు. అలా అతడు సినిమా ఉదయ్ కిరణ్ నుంచి చేజారిపోయింది అని తెలియజేశారు. ఇక ఆ తర్వాత సుస్మితతో వివాహం కూడా క్యాన్సిల్ అవ్వగానే తను ముందు ఒప్పుకున్న సినిమాలు కూడా వెంటవెంటనే ఆగిపోవడం జరిగాయి. దీంతో ఉదయ్ కిరణ్ కెరియర్ డల్ అయిపోయింది అని ఆ తర్వాత మరనీచ్చారని అందరూ అంటూ ఉన్నారని తెలిపారు మురళీమోహన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version