రాష్ట్ర ప్రజలకు మంత్రి అంబటి రాంబాబు బహిరంగ లేఖ.

-

రాష్ట్ర ప్రజలకు మంత్రి అంబటి రాంబాబు బహిరంగ లేఖ రాశారు. పవన్ పొత్తు, సీఎం సీటు వ్యాఖ్యల నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు బహిరంగ లేఖ రాశారు మంత్రి అంబటి రాంబాబు. ఈ మేరకు ఆయన 8 పేజీల లేఖను విడుదల చేశారు. లేఖలో మంత్రి అంబటి.. ‘పవన్ కల్యాణ్ రాజకీయం అంతా బాబు చేత… బాబు వల్ల… బాబు కోసం అన్న నిజాన్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి. ప్రతిపక్షాలన్నింటితో పొత్తు అన్నది కేవలం పవన్ రాజకీయ ఎత్తు మాత్రమే! బాబుతో మరోసారి రాజకీయ వివాహ బంధానికి వేదిక రెడీ చేయటానికే రైతుల పేరిట పవన్ రెండు రోజుల పర్యటన! బీజేపీ- కమ్యూనిస్టులు ఒక పొత్తులో ఉండరని తెలిసు.

బీజేపీ చంద్రబాబును నమ్మటం లేదని, తాము సొంతంగా గెలవాలని బీజేపీ భావిస్తోందని ఆ పార్టీ నేతలే పలుమార్లు చెప్పిన నేపథ్యంలో ఇక వారిని బాబు కోసం తాను వదులుకోక తప్పటం లేదన్న అభిప్రాయం కలిగించటానికే రైట్-లెఫ్ట్-సెంటర్ పార్టీలన్నీ కలిసి రావాలన్న వాదనను పవన్ ముందుకు తోశాడు! 2014 నుంచి 18 వరకు బాబుతో పాటు బీజేపీతో కూడా పవన్ దోస్తీ. బాబుకు మిత్రులైతే పవన్ కూడా మిత్రులే, బాబు- బీజేపీతో విడిపోతున్నప్పుడు పవన్ కూడా అదే రాగం!. -2018-19లో ఆయన స్టేట్మెంట్లు చూడండి… బీజేపీ మన రాష్ట్రాన్ని పొట్టలో పొడిచిందని… పాచి లడ్డూలు ఇచ్చిందని… విడగొట్టి బీజేపీ సృష్టించిన సమస్యలు చాలు అని… కొత్తగా మరిన్ని ప్రత్యేక సమస్యలు సృష్టించవద్దు అని… ఉత్తరాదికి దక్షిణాది వారు బానిసలు కారని…

 

ప్రత్యేక హోదా కోసం ఆమరణ దీక్ష చేయబోతున్నానని చెప్పాడు!. ఎందుకంటే, ప్రత్యేక హోదా వద్దన్న బీజేపీతో తెగతెంపులు చేసుకుంటున్నానన్న సంకేతం పంపగానే, పవన్ కల్యాణ్ అదే బాట!. మరోవంక, పవన్ కల్యాణ్‌ను టీడీపీ వారు ఏమీ అనవద్దు అని అదే సమయంలో చంద్రబాబు ప్రకటన చేయటం కూడా… దత్త తండ్రి, దత్త పుత్రుడి తెరచాటు, తెర ముందు బంధాలను అనుబంధాలను వెల్లడిస్తోంది!. పవన్‌ కల్యాణ్‌ రాజకీయం అంతా బాబు చేత.. బాబు వల్ల.. బాబు కోసం అన్న నిజాన్ని గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ విజ్ఞులైన రాష్ట్ర ప్రజలకు బహిరంగలేఖ’ అంటూ అంబటి రాంబాబు లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version