ఐపీఎల్ 2023: ఢిల్లీ ముందు స్వల్ప లక్ష్యం.. పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలను చిదిమేస్తుందా !

-

ఈ రోజు డబుల్ హెడర్ లో భాగంగా జరుగుతున్న రెండవ మ్యాచ్ లో మొదటి ఇన్నింగ్స్ కాసేపటి క్రితమే ముగిసింది. ఈ మ్యాచ్ లో పంజాబ్ మరియు ఢిల్లీ జట్లు హోరాహోరీ మ్యాచ్ లో తలపడుతున్నాయి. టాస్ గెలిచిన వార్నర్ ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, బదులుగా పంజాబ్ బ్యాటింగ్ లో నిర్ణీత ఓవర్ లలో 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు మాత్రమే చేసింది. వాస్తవంగా మొదటి పవర్ ప్లే లో జరిగిన నష్టాన్ని చూస్తే పంజాబ్ ఇంత స్కోర్ చేస్తుందన్న నమ్మకం లేదు. కానీ ఓపెనర్ ప్రభు సిమ్రాన్ సింగ్ హీరోయిక్ ఇన్నింగ్స్ కారణంగా బలమైన టార్గెట్ ను ఢిల్లీ ముందు ఉంచిందని చెప్పాలి.

ఈ మ్యాచ్ లో ప్రభు సెంచరీ సాధించి పంజాబ్ కు ఈ మాత్రం స్కోర్ ను సాధించి పెట్టడంలో కీలకంగా వ్యవహరించాడు. కాగా ఇప్పుడు 168 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఛేదించి పంజాబ్ ప్లే ఆఫ్ ఆశలను చిదిమేస్తుందా చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version