టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు

-

టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుపై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు మేము ఊహించిందేనన్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కాపులందరూ ఎదురు చూశారని..పవన్ మాత్రం చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయాలని చూస్తున్నాడు.. ఇది అందరూ గమనించారని పేర్కొన్నారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు… ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి చేసిందేమీ లేదని విమర్శలు చేశారు.

సిద్ధం సభ వద్ద మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ….చివరి సిద్ధం సభ సూపర్ సక్సెస్..15 లక్షలకు మించి ప్రజలు హాజరవుతారన్నారు. ఈ సభ మాకు ఎన్నికల ప్రచారం లాంటిది..గత సభలకు మించి ప్రజల స్పందన ఉందని చెప్పారు. ఏపీలో 90 శాతం మందికి పైగా ప్రభుత్వ పథకాలు అందాయి..అందరూ కలిసినా మాకేం కాదని వివరించారు.

ప్రజలు సీఎం జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులయ్యారు.. 50 శాతానికి పైగా ప్రజలు జగన్ వెంట ఉంటే.. ఎన్ని పార్టీలు పొత్తు పెట్టుకున్నా మాకు నష్టం లేదని తెలిపారు. రానున్న ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల చేస్తారని భావిస్తున్నాం..మేము కూడా ఆయన మాటల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version