అంబటి వర్సెస్ అయ్యన్న: తెలుగురాని సన్నాసి..కామ పిశాచి.!

-

ఏపీలో వైసీపీ-టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ఏ మాత్రం తగ్గట్లేదు..ఇంకా రోజురోజుకూ మాటల యుద్ధం ముదురుతూనే ఉంది. ఇదే క్రమంలో పాదయాత్ర చేస్తున్న లోకేష్..పదునైన మాటలతో వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ఇప్పటికే చిత్తూరులో మంత్రులు పెద్దిరెడ్డి, రోజాలని గట్టిగా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. డైమండ్ పాప, జబర్దస్త్ ఆంటీ అంటూ రోజాపై లోకేష్ సెటైర్లు వేశారు. అటు రోజా సైతం లోకేష్ అంకుల్ అని, మీ అమ్మ, పెళ్లాన్ని ఏం అనాలి అంటూ ఫైర్ అయ్యారు.

ఇదే సమయంలో తెలుగురాని సన్నాసి లోకేష్ అంటూ అంబటి రాంబాబు విమర్శించారు. వాడుక బాష తెలుగుని సైతం సరిగ్గా మాట్లాడటం రాదని అన్నారు.  తెలుగు మాట్లాడలేని వాడు టీడీపీ వారసుడా అని, ఇదేనా రాష్ట్రానికి చంద్రబాబు చెప్పిన ఖర్మ అంటూ సెటైర్లు విసిరారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీ మరింత పతనం అవుతుందన్నారు.

అయితే జగన్ కంటే లోకేష్ చాలా బెటర్ అని.పేపర్ లేనిదే జగన్ చదవలేరు అని..పైగా అన్నీ తప్పులే చదువుతారని..జగన్ స్పీచ్ లని తెలుగు తమ్ముళ్ళు ట్రోల్ చేస్తున్నారు. అదే సమయంలో అంబటి రాంబాబుని టార్గెట్ చేసుకుని టి‌డి‌పి సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు విరుచుకుపడ్డారు. “కామ పిశాచి, కామ వాంఛ నుంచి బయటకురారా.. పోలవరం పూర్తి చెయ్యరా..” అంటూ ట్వీట్ చేశారు.

అటు రోజాపై వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు. లోకేష్‌కు పంపుతా అన్న చీర, గాజులు తెలుగు మహిళలు రోజా ఇంటికి తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే టి‌డి‌పి మహిళలని పోలీసులు అదుపులోకి తీసుకుని రాత్రి అయినా స్టేషన్లో నిర్బంధించారు అని వంగలపూడి అనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ప్రశ్నిద్దాం అంటే ఈ డీజీపీ తెలుగుదేశం వారికి ఎప్పుడూ అపాయింట్మెంట్ ఇవ్వరు అంటూ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version