తెలుగు లో అమిత్ షా సంచలన ట్వీట్..!

-

సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం గా నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం మీద కేంద్ర హోం శాఖ మంత్రి బీజేపీ అగ్ర నేత అమిత్ షా రియాక్ట్ అయ్యారు. ప్రతి ఏటా సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం జరపడానికి మంగళవారం కేంద్ర హోంశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేయగా దీని మీద బుధవారం అమిత్ షా తెలుగు లో ఎమోషనల్ ట్వీట్ చేశారు.

హైదరాబాద్ విమోచన ఉద్యమంలో అమరవీరుల స్మారకార్థం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవం గా జరుపుకోవాలని మోడీ నిర్ణయించడం ఇది చారిత్రక చారిత్రాత్మకమైన రోజు అని అన్నారు. యువతలో దేశభక్తి జ్వాల రగిలించి స్వాతంత్ర ఉద్యమంలో మన చిహ్నాలని చిరస్థాయిగా నిలపడానికి మోడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను అని చెప్పారు హైదరాబాద్ ప్రాంతాన్ని దారుణమైన నిజాం పాలన నుండి విముక్తి చేసిన భారతదేశంలో భాగమే ఉండేందుకు త్యాగాలు చేసిన వాళ్లకి నివాళి అని ట్వీట్ లో పేర్కొన్నారు అమిత్ షా.

Read more RELATED
Recommended to you

Exit mobile version