అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ ఎఫెక్ట్…. జామ్ నగర్ ఎయిర్ పోర్టుకు అంతర్జాతీయ హోదా

-

రిలయన్స్ ఇండస్ట్రీ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్ల ప్రీ వెడ్డింగ్ కోసం జామ్ నగర్ విమానాశ్రయం అంతర్జాతీయ హోదాను పొందింది. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 5వ తేదీ వరకు ఈ హోదా ఉండనుంది. ముఖేష్ అంబానీ విజ్ఞప్తి మేరకు ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా జామ్నగర్లో ప్రత్యేక ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని నిర్మించింది. కస్టమ్స్, ఇమ్మిగ్రేషన్ సౌకర్యాలను అందుబాటులో ఉంచింది. వీవీఐపీల రాకతో జామ్ నగర్ కి ప్రపంచస్థాయి గుర్తింపు లభించింది.

కాగా,అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతోంది. గుజరాత్ లోని జామ్ నగర్ కి దేశ విదేశాల నుంచి వందలాది మంది ప్రముఖులు తరలిరావడంతో గత రాత్రి ప్రీ వెడ్డింగ్ వేడుక సందడిగా మారింది. అతిథులంతా ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉత్సాహంగా గడిపారు.

Read more RELATED
Recommended to you

Latest news