మరి కాసేపట్లో ముగియ‌నున్న ట్రాఫిక్ చ‌లాన్ల చెల్లింపు గ‌డువు

-

పెండింగ్లో ఉన్న చలాన్లను వెంటనే చెల్లించేందుకు రాష్ట్రంలోని వాహనదారులకు పెండింగ్ చలాన్లపై డిస్కౌంట్ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే . అయితే పెండింగ్ చలాన్లపై ప్రకటించిన డిస్కౌంట్ ఆఫర్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. అర్ధరాత్రి 11.59 గంటల వరకే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని, వాహనదారులు వినియోగించుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు. ఇప్పటికే రెండుసార్లు గడువును పొడిగించగా.. మరోసారి పెంచే అవకాశం లేదంటున్నారు. ఇక ఇప్పటివరకు 1.66 కోట్ల పెండింగ్ చలాన్లపై పోలీస్ శాఖకు రూ.147 కోట్ల ఆదాయం సమకూరింది.

 

2023 Dec 25కి ముందు ఉల్లంఘనలకు మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది.గడువు ముగిసిన తర్వాత మరోసారి పొడిగించే అవకాశం లేదని అధికారులు స్పష్టం చేశారు.ఆటోలు, ఫోర్ వీలర్లకు 60 శాతం, టూ వీలర్లకు 80 శాతం, ఆర్టీసీ బస్సులు ,తోపుడుబండ్లపై 90% రాయితీ కల్పించింది. భారీ వాహనాల పై 50% రాయితీని కల్పించింది. రాష్ట్రంలో రెండు కోట్లకు పైగా పెండింగ్ చలాన్లు ఉండడంతో ఈ మేరకు పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version