ఎమ్మెల్సీ ఎన్నికలు.. పార్టీ నేతలతో పీసీసీ చీఫ్ జూమ్ మీటింగ్

-

రేపు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పార్టీ నేతలతో జూమ్ మీటింగ్ నిర్వహించారు.పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి 4 ఉమ్మడి జిల్లాల (ఆదిలాబాద్ – నిజామాబాద్ – మెదక్ – కరీంనగర్) మండల అధ్యక్షులతో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు సాధనకు అనుసరించాల్సిన వ్యూహాలపై మండల అధ్యక్షులకు దిశానిర్దేశం చేశారు.

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపునకు కేడర్‌ను సమాయత్తం చేయాలన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, భవిష్యత్‌లో ఖాళీగా ఉన్న మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేస్తుందని వివరించాలని సూచించారు. విద్య, ఉద్యోగం, ఉపాధి రంగాల్లో ప్రభుత్వం తీసుకున్న చర్యలతో పట్టభద్రుల్లో,ఉద్యోగ,ఉపాధ్యాయ వర్గాల్లో పార్టీ పట్ల నెలకొన్న సానుకూలతను తమకు అనుకూలంగా మల్చుకోవాలని స్పష్టంచేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version