Andhra Pradesh :మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బీసీ జనార్ధన్ రెడ్డి

-

ఆంధ్ర ప్రదేశ్ లో కొత్త సర్కార్‌ ఏర్పడింది.. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సహా.. పలువురు మంత్రులు తమకు కేటాయించిన శాఖల బాధ్యతలు స్వీకరించారు.ఇక, ఈ రోజు రాష్ట్ర రోడ్లు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రిగా బీసీ జనార్ధన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.సచివాలయంలోని తన ఛాంబర్‌లో మొదట వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకున్న తర్వాత మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

ఇక, అనంతరం మంత్రి బీసీ జనార్ధన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…. 2014-19లో ఆర్ అండ్ బీ శాఖకు బడ్జెట్‌లో 14 వేల 970 కోట్ల రూపాయలు కేటాయించగా రూ.12 వేల 64 కోట్లు ఖర్చు చేయడం జరిగింది అని అంటే 80 శాతం నిధులు ఖర్చు చేసినట్టు వెల్లడించారు. కాగా, గత ప్రభుత్వం 2019-24లో ఆర్ అండ్ బీకి రూ.19 వేల 428 కోట్లు బడ్జెట్ ల్లో కేటాయించగా అందులో రూ.9 వేల 15 కోట్లు.. అనగా 46 శాతం మాత్రమే ఖర్చు చేశారని తెలిపారు. గత ప్రభుత్వంలో జరిగిన రూ. 2 వేల 261 కోట్లకు బిల్లులు చెల్లించ లేదని ,దీంతో కాంట్రాక్టర్లు చాలా ఇబ్బంది పడుతున్నారని.. ఇప్పుడు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొందని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version