మంత్రి అంబటి పై మరోసారి నటుడు పృథ్వీ సెటైర్స్..!

-

అనకాపల్లి సర్వ కామదాంబా పార్క్ సెంటర్ లో సినీ నటుడు పృథ్వీ గాజు గ్లాస్ జనసేన ప్రచారం చేశారు.  భవన నిర్మాణ కార్మికులు గాజు గ్లాసుకు ఓటు వేసి అనకాపల్లిలో కొనతల రామకృష్ణను గెలిపించాలని కోరారు. గాజు గ్లాసు పగిలే కొద్దీ పద్ధతి ఎక్కుతాది లపూట్ అంటూ అంబటి రాంబాబును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

“ఈ మధ్య జాతర్లలో బాగా డాన్స్ చేస్తున్నావు. నాకన్నా బాగా డాన్స్ చేస్తున్నావు. మా ప్రభుత్వం వచ్చాక కార్యకర్తలు అడిగితే షోలు పెడతాం. ఒక లక్ష రూపాయలు ఇప్పిస్తాం. వచ్చి డాన్స్ వేస్తా ఉండు.” అని అన్నారు. “మంత్రులుగా ఉండి ప్రాజెక్టుల కోసం సమీక్షలు, సమావేశాలు లేకుండా చిల్లర వ్యాఖ్యలు చేస్తున్నారు. రోజా అయితే ఏపీలో టూరిజం ఎక్కడికో పోయింది అంటున్నారు. అంటే ఎక్కడ పోయిందో తెలియదు. పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుపతికి వచ్చి అసభ్య పదజాలాలతో మాట్లాడుతున్నారు.” అని విమర్శించారు. కోడి గుడ్డు మంత్రి గుడివాడ అమర్నాథ్ భూముల దోపిడీకే నియమించుకున్నారు. గుడివాడ అమర్ గాజువాకలో కూడా గెలిసే ప్రసక్తే లేదు. ముద్రగడ పద్మనాభంకు డబ్బు, పదవి, అధికార దాహం, తలకెక్కి మాట్లాడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version