ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి : రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్

-

పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 13న జరగనున్న పోలింగ్ లో అత్యధిక శాతం ఓటింగ్ శాతం నమోదు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజు అన్నారు. నగరంలోని అబిడ్స్ లోని అల్ సెయింట్ హై స్కూల్ లో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటర్ ఫెసిలిటెషన్ సెంటర్ ని ఆయన సోమవారం పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి రోనాల్డ్ రోస్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ వివరాలను తెలియజేసారు. సికింద్రాబాద్ పార్లమెంట్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రత్యేక పోస్టల్ బ్యాలెట్ ఓటు వేసేందుకు ఫెసి లిటేషన్ సెంటర్లను ఏర్పాటు చేసినట్లు సీఈ ఓకు వివరించారు. ఫెసిలిటేషన్ సెంటర్లో ఏర్పాటు చేసిన వసతులు పట్ల రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ సంతృప్తి వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version