శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్.. ఒక్క రోజులో తిరుమల ట్రిప్..ఉచితంగా శీఘ్రదర్శనం

-

తిరుమల వెంకన్న స్వామి భక్తులకు అదిరిపోయే ప్యాకేజీ అందుబాటులోకి వచ్చేసింది. ఈ టూర్ ప్యాకేజీ కేవలం ఒక రోజులో పూర్తవుతుంది. దీనిని తెలంగాణ టూరిజం నిర్వహిస్తోంది. బస్సులోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పెద్దలకు ఈ టూర్ ప్యాకేజీ టిక్కెట్ ధర 3700 రూపాయలు., అలాగే పిల్లలకు 2960 రూపాయలు. ఈ ప్యాకేజీలో తిరుమలలో ఉచితంగా శ్రీవారి శీఘ్ర దర్శనం కూడా ఉంటుంది.

ఈ తిరుమల టూర్ ప్యాకేజీ వివరాలు ఒకసారి చూస్తే.. తిరుపతి తిరుమల టూర్ పేరుతో తెలంగాణ టూరిజం ఓ ప్యాకేజీని ప్రకటించారు. ఈ ప్యాకేజీని హైదరాబాద్ నుండి బస్సులో నిర్వహిస్తారు. తిరుపతి, తిరుమల, తిరుచానూరు కేవలం ఒక్కరోజులో కవర్ చేసేలా ఇందులో ప్లాన్ చేసారు. ఈ ప్యాకేజీలో భాగంగా మొదటి రోజు బస్సు హైదరాబాద్ నుండి సాయంత్రం 5 గంటలకు బయలుదేరుతుంది. ఇక మరుసటి రోజు ఉదయం 7 గంటలకు తిరుమల చేరుకుంటారు. రిఫ్రెష్ అయిన తర్వాత, అక్కడ ఉన్న దేవాలయాలను చూస్తారు. అనంతరం తిరుమలలో శ్రీవారి శీఘ్ర దర్శనం ఉచితంగా ఉంటుంది. దర్శనం తర్వాత తిరుపతి చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Latest news