పేదవాడి భవిష్యత్ బాగుపడాలంటే.. మంచి పాలకుడికి ఓటు వేయాలి : సీఎం జగన్

-

పేదవాడి భవిష్యత్ బాగుపడాలంటే.. మంచి పాలకుడికి ఓటు వేయాలి  సీఎం జగన్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఏటుకూరులో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ మాట్లాడారు. చంద్రబాబుకు ఓటేస్తే సంక్షేమ పథకాలు అన్ని ఆగిపోతాయి. చంద్రబాబు 2014లో ఎన్నో హామీలు ఇచ్చారు వాటిలో ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అప్పుడు బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు కూడా అదే ముగ్గురు పొత్తుతో వస్తున్నారు.

రంగురంగుల కాగితాలతో, రంగు రంగు ఆశలతో ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. అప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు.. కానీ ఇప్పుడు కొత్తగా హామీలు ఇస్తున్నారని పేర్కొన్నారు. ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచిన వైసీపీ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రజలు రెండు సార్లు ఫ్యాన్ గుర్తుకు బటన్లు నొక్కాలని కోరారు. రాష్ట్రం బాగు కోసం.. ప్రతీ పేదవాడి భవిష్యత్ కోసం ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని కోరారు. వైసీపీ 2019లో ఇచ్చిన హామీలను 99 శాతం నెరవేర్చామని గుర్తు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version