కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధం : సీఎం జగన్

-

కుట్రలు, కుతంత్రాలను ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధం అన్నారు ఏపీ  సీఎం జగన్. ఇవాళ నంద్యాలలో నిర్వహించిన మేమంతా సిద్ధం సభలో మాట్లాడారు. నారా వారి పాలన మళ్లీ ఒప్పుకోమని ప్రజలు చెబుతున్నారు. ఒకవైపు చంద్రబాబు, దత్తపుత్రుడు, బీజేపీ.. పరోక్షంగా కాంగ్రెస్.. ఇటు వైపు నేను ఒక్కడినే.. జగన్ ని ఎదుర్కొనేందుకు ఇంత మంది తోడేళ్లు ఏకమయ్యారు అని తెలిపారు.

ఐదేళ్ల ఇంటింటి ప్రగతిని వచ్చే ఐదేళ్లలో మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్తామన్నారు. గతంలో చంద్రబాబు అబద్దాలు, మోసాల పాలన చూశారు. మోసాల బాబుకు ఇవి చివరి ఎన్నికలు కావాలని పిలుపునిస్తున్నానని తెలిపారు. 175కి 175 అసెంబ్లీ స్థానాలు..  25 కి 25 ఎంపీ స్థానాల్లో విజయం సాధించాలని కోరారు. డబుల్ సెంచరీ సర్కార్ ను ఏర్పాటు చేసేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారు. లంచాలు లేకుండా వివక్ష పాలన ఎప్పుడు వచ్చిందంటే.. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాతనే అని చెప్పారు. పౌరసేవలు ప్రభుత్వంలో ఎలా మారాయో మీరే చూడండి.. గమనించండి అని కోరుతున్నా. 

Read more RELATED
Recommended to you

Exit mobile version