వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి కారు అద్దాలు ధ్వంసం..!

-

ఏపీలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పలుచోట్ల ఉద్రిక్తతల చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలో చాలా చోట్ల వైసీపీ, టీడీపీ శ్రేణులు ఘర్షణకు దిగారు. పరస్పరం దాడులకు దిగుతున్నారు. దీంతో ఆయా నియోజకవర్గాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. ఏపీలో మూడు, నాలుగు జిల్లాల మినిహా అన్ని జిల్లాలో ఏదో ఒక చోట వైసీపీ, టీడీపీ కార్యకర్తలు కొట్టుకుంటున్నారు. తాజాగా అనంతపుం జిల్లా తాడిపత్రిలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి జేసీ అస్మిత్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

అయితే ఉదయం పోలింగ్ ప్రారంభమైన నుంచి ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. కానీ మధ్యాహ్నం 12 గంటల అయ్యే సరికి తాడిపత్రి కమాన్ సర్కిల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే పెద్దారెడ్డి, టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్ రెడ్డి వర్గీయులు ఘర్షణకు దిగారు. పరస్పరం కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి కారు అద్దాలతో పాటు పలు వాహనాలు సైతం ధ్వంసం అయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు తాడిపత్రిలో భారీగా మోహరించారు. ఇరువర్గాలను చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు. మరోసారి పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version