ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర కేబినెట్ భేటీ వాయిదా

-

ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర కేబినెట్ స‌మావేశాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం వాయిదా వేసింది. ఈ నెల 3న రాష్ట్ర కేబినెట్ స‌మావేశం కావాల్సింది. కాగ ఇప్పుడు వాయిదా వేయ‌డంతో.. ఈ స‌మావేశం ఈ నెల 7 వ తేదీన నిర్వ‌హిస్తామ‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. కాగ గ‌త కొద్ది రోజు క్రితం ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర మంత్రి మేక‌పాటి గౌతమ్ రెడ్డి గుండె పోటుతో మ‌ర‌ణించిన విషయం తెలిసిందే. కాగ మేకపాటి గౌత‌మ్ రెడ్డి పెద్ద క‌ర్మ ఉండ‌టంతో ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర కేబినెట్ స‌మావేశాన్ని వాయిదా వేసిన‌ట్టు రాష్ట్ర ప్ర‌భుత్వం తెలిపింది.

మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి పెద్ద క‌ర్మ ప‌నులు ముగిసిన త‌ర్వాత ఈ నెల 7 వ తేదిన కేబినేట్ స‌మావేశం నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు. కాగ వ‌చ్చే అసెంబ్లీ స‌మావేశాల్లో ముఖ్యంగా రాష్ట్ర ప్ర‌భుత్వం బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్టనుంది. ఇప్ప‌టికే రాష్ట్ర బ‌డ్జెట్ పై రాష్ట్ర ప్ర‌భుత్వం క‌స‌ర‌త్తు చేసింది. అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌లు ఆదుకునేలా.. రాష్ట్ర బడ్జెట్ ఉండ‌నుంద‌ని ప‌లు మార్లు.. రాష్ట్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు కూడా ప్ర‌క‌టించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version