పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఇద్దరు బిజెపిలోకి రాబోతున్నారు – ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి

-

అసెంబ్లీ లాబీల్లో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి ఇద్దరు బిజెపిలోకి రాబోతున్నారు అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరేందుకు మిధున్ రెడ్డి బీజేపీ అగ్ర నాయకత్వంతో టచ్లోకి వెళ్లారన్న ఆదినారాయణ రెడ్డి… ఆయన తండ్రి కూడా అదే బాటలో ఉన్నారని తెలిపారు.

వైసీపీ ఖాళీ కావడం ఖాయంగా కన్పిస్తోంది….స్వయంగా మిధున్ రెడ్డి బీజేపీ నాయకత్వంతో మాట్లాడుతున్నారని బాంబు పేల్చారు. బీజేపీ ఒప్పుకుంటే అవినాష్ రెడ్డి మినహా వైసీపీ ఎంపీలంతా పార్టీ మారడానికి రెడీగా ఉన్నారన్నారు బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి. కానీ బీజేపీ నాయకత్వం వాళ్లు అక్కర్లేదని అంటోంది….కానీ మేం చేరతామంటూ మిధున్ ఇంకా లాబీయింగ్ నడుపుతున్నారన్నారు. తనతో పాటు బీజేపీలో చేరాల్సిందిగా తన తండ్రి పెద్దిరెడ్డి మీద కూడా మిధున్ ఒత్తిడి తెస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news