BREAKING: తిరుమలలో చిక్కిన మరో చిరుత

-

తిరుమలలో మరో చిరుత కలకలం రేపింది. తాజాగా ఇవాళ ఉదయం తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో చిరుత బోనులో చిక్కింది. గత వారం రోజుల క్రితం బోనులో చిక్కిన ప్రాంతానికి సమీపంలోనే చిరుత బోనులో చిక్కింది. నిన్న అర్ధరాత్రి ఏడవ మైలురాయి వద్ద బోనులో పడింది చిరుత. ఇప్పటివరకు నాలుగు చిరుతలు అటవీ శాఖ అధికారులకు చిక్కాయి.

దీంతో శేషాచల కొండలలో ఆపరేషన్ చిరుత ముగిసిపోయింది. ఇక నుంచి భక్తులు నడక మార్గంలో ప్రశాంతంగా వెళ్లేందుకు మార్గం సుగమము అయింది. ఇవాళ దొరికిన చిరుత మగది అని అధికారం చెబుతున్నారు. నాలుగు రోజుల్లో నుంచి… ఈ చిరుతను ట్రాప్ లో పడేసేందుకు అధికారులు నాన ప్రయత్నాలు చేశారు. కానీ నిన్న రాత్రి చిరుత బోనులో చిక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news