రాజమండ్రి పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణమురళీపై కేసు నమోదు

-

సినీ నటుడు పోసాని కృష్ణమురళీ కు ఊహించని షాక్ తగలింది. రాజమండ్రి పోలీస్ స్టేషన్‌లో సినీ నటుడు పోసాని కృష్ణమురళీపై కేసు నమోదు అయింది. పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ జనసేన పార్టీ నేతలు సినీ నటుడు పోసాని కృష్ణమురళీపై ఫిర్యాదు చేశారు.

A case has been registered against Posani Krishna Murali at Rajahmundry Police Station
A case has been registered against Posani Krishna Murali at Rajahmundry Police Station

పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో కోర్టును ఆశ్రయించారు జనసేన నేతలు. ఈ తరుణం లోనే సినీ నటుడు పోసాని కృష్ణమురళీపై కేసు నమోదు చేయాలంటూ హైకోర్టు ఆదేశించింది. ఇక కోర్టు ఆదేశంతో సినీ నటుడు పోసాని కృష్ణమురళీపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు రాజమండ్రి పోలీసులు.

కాగా నిన్న ఆ ప్రెస్ మీట్ నిర్వహించారు పోసాని కృష్ణ మురళి. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు పోసాని కృష్ణ మురళి. అసలు జనసేన పార్టీ ఎందుకు పెట్టారని… తెలుగుదేశం పార్టీ నేతలకు ఊడిగం చేయడానికా ? అంటూ నిలదీశారు పోసాని కృష్ణ మురళి.

Read more RELATED
Recommended to you

Latest news