కుంభమేళా వెళుతుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో 7 గురు ఏపీ వాసులు మృతి మరణించారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు ఏపీ వాసులు మృతి చెందారు. ప్రయాగ్రాజ్లో కుంభమేళాకు వెళ్లి తిరిగి వస్తుండగా ట్రక్కును ఢీకొట్టింది మినీ బస్సు.
![](https://cdn.manalokam.com/wp-content/uploads/2025/02/Untitled-1-40.jpg)
జబల్పూర్ జిల్లా సిహోర వద్ద ఉదయం 8.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనా స్థలంలో ఏడుగురు చనిపోగా.. పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. మరికొందరు మినీ బస్సుల్లో గాయాలతో చిక్కుకున్నట్లు తెలిపారు కలెక్టర్ దీపక్ కుమార్ సక్సేనా. ఈ ఘటనా స్థలంలో ఏడుగురు చనిపోగా.. వారందరూ ఏపీకి చెందిన వాళ్లని అధికారులు ప్రకటించారు. ఇక వారి వివరాలు తెలియాల్సి ఉంది.